మహాకూటమికి డిపాజిట్లు దక్కవు..హరీశ్ రావు

-

తెలంగాణకి నమ్మకద్రోహం చేసిన పార్టీలకు డిపాజిట్లు దక్కవంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, తెదేపాల కలయికతో ఏర్పడిన మహాకూటమి మరో సారి రాష్ట్రాన్ని వంచించడానికి సిద్ధపడిందంటూ విమర్శలు చేశారు. సిద్ధిపేట నియోజకవర్గం అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమన్నారు. మహాకూటమికి ఓటేస్తే మరో సారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అటు అమరావతికి ఇటు ఢిల్లీకి తాకట్టుపెట్టాల్సిందే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news