బిగ్ బ్రేకింగ్‌: పైపైకి క‌దిలిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు పైపైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం పెరిగింది. రూ.130 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,480 నుంచి రూ.41,610కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.38,020 నుంచి రూ.38,150కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డంతో కేజీ వెండి రూ.49,000 వద్దనే స్థిరంగా ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,950కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.40,150కు ఎగసింది. ఇక కేజీ వెండి ధరలో మార్పు లేదు. రూ.49,000 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news