కొన్ని రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించడం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. 5.1 శాతం GDP కి పన్ను మనం సమకూర్చితే.. 2.1 శాతం కూడా తెలంగాణ కు నిధులు కేంద్రం కేటాయించడం లేదు అని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తుంది. అమెరికాను చూసి నేర్చుకోవాలి. ఎన్నికలు ఉన్న రాష్ట్రానికే నిధులు కేటాయించడం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాళ్ళు అరిగేలా మోదీని,కేంద్ర మంత్రులను కల్సిన నిధులు ఇవ్వలేదు. ఎక్కడికక్కడ వివక్ష చూపడం పట్ల కాంగ్రెస్ నిరసన చేస్తుంది.
కేటీఆర్, కేసిఆర్,హరీష్ రావు లు రాజకీయాలు పక్కన పెట్టీ మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరమా ఉంది. కొంత సేపు రాజకీయాలు పక్కన పెడదాం. మాతో రండి.. ఎందుకు ముఖం చాటుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద యుద్ధం ప్రకటిద్దాం. యువ నాయకుడు సీఎం గా ఉన్నారు.. వీరిని అణగదొక్కాలని ఈ ధోరణి అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు సీపీఎం సీపీఐ మిగతా అన్ని పార్టీలు కలసి రావాలి. తెలంగాణ రక్తం మీలో ఉంటే సీఎం తో కలసి రండి. ఇవాల్టి ధర్నా కేవలం ఆరంభం మాత్రమే. కేంద్రం దిగి వచ్చి నిధులు ఇచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్నికల కోసం బడ్జెట్ పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయడమే. బండి సంజయ్,కిషన్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్న ఎందుకు కొట్లాడటం లేదు. మీలో తెలంగాణ రక్తం లేదా..? తెలంగాణ మీద ప్రేమ ఉంటే మంత్రి పదవులకు రాజీనామా చేయండి. నిధుల కోసం కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు.