తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసారు. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలియదు.. బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు అన్నారు. మా అంచనా ప్రకారం.. తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుంది. అందులో ఓటర్లు 3కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని తెలిపారు. బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉండాలన్నారు. మా దగ్గర సర్వే కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. అదేవిధంగా 2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్టు చూపించారని తెలిపారు శ్రీనివాస్ గౌడ్. బీహార్ లో బీసీల జనాభా 10 శాతం పెరిగినట్టు చెప్పి కులాల వారిగా జాబితా ఇచ్చారు. కాంగ్రెస్ మాత్రం సంవత్సరం పాటు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.