జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..!

-

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 18న నమోదైన నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు అధికారులు.

అయితే స్కూటినీ తరువాత 21 తేది వరకు నామినేషన్ల విత్ డ్రా కు అవకాశం ఉంది. ఇక 25 న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో పోలింగ్ జరగగా.. 25 న సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించనున్నారు అధికారులు. జిహెచ్ఎంసి కౌన్సిల్ లో బలాబలాలు మారడంతో ఆసక్తిగా మారింది స్టాండింగ్ కమిటీ ఎన్నిక. అయితే గతంలో కలిసి స్టాండింగ్ కమిటీ సభ్యులను పంచుకున్నాయి ఎంఐఎం, బిఆర్ఎస్. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో ఆసక్తిగా మారాయి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.

Read more RELATED
Recommended to you

Latest news