అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట యూట్యూబ్ జర్నలిజం పేరిట ఇష్టం వచ్చినట్లు వాగితే ఊరుకోమని స్పష్టంచేశారు. జర్నలిజం పేరిట కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను తిడతారా? వాళ్ల ఇంట్లో కూడా తల్లి, చెల్లి, భార్య ఉంటారు కదా? ఇలాంటి వాళ్లను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మీద సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు.
యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద పరిగణిస్తామని, తప్పుడు వార్తలు రాసినా, పిచ్చిగా వాగితే గుడ్డలు ఊడతీసి కొడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాగా, ఇటీవల యూట్యూబ్ జర్నలిజం పేరిట సీఎం రేవంత్ను అసభ్యంగా దూషించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేయగా.. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.