అమరావతి(పోలవరం): పంచాయతీరాజ్ వ్యవస్థలో జనసేన పార్టీ జోక్యం చేసుకోబోదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. పోలవరం పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సర్పంచుల సమావేశంలో పవన్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఇందిరమ్మ కమిటీ, జన్మభూమి కమిటీ, గ్రామ సచివాలయాల పేరుతో వారి పాలనలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచే కొత్తతరం రాజకీయాల్లోకి రావాలన్నారు. సీఎం పదవి చంద్రబాబు, జగన్లకు వారసత్వమేమో గానీ తనకు మాత్రం బాధ్యత అని స్పష్టం చేశారు.
జగన్, చంద్రబాబుల్లా వారసత్వ సీఎం కాదు: పవన్
By Anil Kumar
-
Previous article
Next article