కౌశల్ పై గీతా మాధురి వర్షన్ ఇది

-

బిగ్ బాస్-2 విన్నర్ గా కౌశల్ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇంటర్వ్యూస్ లో కూడా కౌశల్ హౌజ్ మెట్స్ అంతా ఒకవైపు తానొకవైపు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక తాను టైటిల్ గెలిచినా ఏ ఒక్క కంటెస్టంట్స్ తనకు ఫోన్ చేయలేదని వెళ్లడించడం జరిగింది. అయితే ఈ విషయంపై బిగ్ బాస్ రన్నరప్ గీతా మాధురి నోరు విప్పింది.

బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ గెలిచిన వెంటనే పక్కనే ఉన్న తను కంగ్రాట్స్ చెప్పానని. ఇక ఆ తర్వాత కూడా కౌశల్ నెంబర్ తెలుసుకుని తాను కాల్ చేశానని.. వాయిస్ మెసేజ్ కూడా పెట్టానని.. కౌశల్ భార్య నీలిమ తనకు రెస్పాన్స్ ఇచ్చిందని అన్నారు. ఇక భాను శ్రీ బర్త్ డే నాడు కౌశల్ కు కాల్ చేసిందని. రెండు మూడు సార్లు కాల్ చేసినా సరే కౌశల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అన్నారు గీతా మాధురి.

ఇక కౌశల్ తనపై చేస్తున్న కామెంట్స్ మీద ఎక్కువ రియాక్ట్ అవలేదు గీతా మాధురి. మొత్తానికి తనకు ఎవరు కాల్ చేయలేదు అని చెబుతున్న కౌశల్ కంటెస్టంట్స్ ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వాలన్నది తెలియలేదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news