శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. సహజంగా ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నియమాలను అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఇల్లును కట్టిన తర్వాత కూడా ఇంట్లో వస్తువులను పెట్టే సమయంలో వాస్తు నియమాలను పాటించాలి. ఎప్పుడైతే వాస్తు నియమాలను పాటిస్తారో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, ముఖ్యంగా శారీరక ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. పైగా, మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. ఇంట్లో వాస్తు ఆరోగ్యం, సంపద వంటి ఎన్నో విషయాల్లో మార్పును పొందుతారు.
ఎప్పుడైతే ఈశాన్య దిశలో ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఉంచుతారో, పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. దీనితో పాటు, ఈశాన్యం మూలలో మెట్లు లేక మరుగుదొడ్డి వంటి వాటిని అస్సలు నిర్మించకూడదు. వాటివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ముఖ్యంగా పిల్లల అభివృద్ధి దెబ్బతింటుంది. ఇంట్లో నీటి కొళాయి కారుతున్నట్లయితే ప్రతికూల శక్తి పెరుగుతుంది. కనుక అటువంటి వాటిని పరిష్కరించుకోవాలి. దీంతో ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ జీవించాలంటే, బెడ్ రూమ్ లోని మంచం ఎదురుగా అద్దాన్ని ఉంచకూడదు.
ఇంట్లో తులసి మొక్కలను నాటడం గాలి శుద్ధి అవుతుంది. అలాగే ముళ్ళ మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు, వాటివల్ల అనారోగ్యం, ఒత్తిడి ఎక్కువ అవుతాయి. మంచి నిద్రను పొందాలంటే మొబైల్ ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్ లను మంచం నుండి దూరంగా ఉంచాలి. నిద్రపోయే సమయంలో దక్షిణం వైపు అస్సలు తల పెట్టకూడదు. ఉత్తరం వైపున తల పెట్టి పడుకోవడం కూడా మంచిది కాదు. వీటి వలన ఒత్తిడి, తలనొప్పి వంటివి ఎదురవుతాయి మరియు జీవనశైలి దెబ్బతింటుంది. కనుక ఇటువంటి వాస్తు నియమాలను పాటించి, ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోండి.