ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్ జగన్ ? – TDP

-

ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్ జగన్ ? అంటూ టీడీపీ పార్టీ ఫైర్ అయింది. జగన్ ను చూసేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. మాజీ సీఎం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు సింగయ్య. దింతో సింగయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు బంధువులు.

tdp jagan
tdp jagan

ఈ తరుణంలోనే టీడీపీ పార్టీ స్పందించింది. జగన్ రెడ్డి ప్రచార పిచ్చకి మరొకరు బలయ్యారన్నారు. సత్తెనపల్లి వెళ్తూ, ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టిందని పేర్కొన్నారు. కనీస మానవత్వం లేకుండా, గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోగా, స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించారని ఆగ్రహించారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్ జగన్ ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news