ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్..రుణపరిమితి పెంపు !

-

ఏపీలోని రైతులకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు పంట రుణ పరిమితిని బ్యాంకర్ల కమిటీ పెంచింది. దీనితో ఈ సంవత్సరం వరి పంటకు రూ. 5వేల నుంచి రూ. 6వేలు, పత్తికి రూ. 4వేల నుంచి రూ. 5 వేలకు పెంచారు. ఖరీఫ్ వరికి రూ. 46-52 వేలు, రబీలో రూ. 50-55 వేలు, శ్రీవరికి రూ. 35- 40 వేల చొప్పున బ్యాంకులలో రుణాలను ఇస్తాయి.

Chandrababu's key decision Now they will have meals with plain rice
Tab for those in self-help groups in the state of Andhra Pradesh

ఎర్ర మిర్చి సాగుకు ఎకరానికి రూ. 35 నుంచి 50 వేలు వరకు అదనంగా డబ్బులను రైతులకు అందజేస్తారు. ఏపీలోని రైతులు ఈ విషయం తెలిసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలులోకి వస్తున్నాయని అంతే కాకుండా పనిముట్లను కూడా చాలా తక్కువ ధరకే అందిస్తున్నారని సంతోష పడుతున్నారు. 90% రాయితీతో పనిముట్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news