గిరిజన మహిళల ప్రైవేట్ మీద పైశాచికత్వం… కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

-

తెలంగాణ రాష్ట్రంలో మరో లగచర్ల తరహా సంఘటన జరిగింది. మహిళల బట్టలు చింపేసి, వారిపై దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు. 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు గిరిజనులు. దింతో మా భూములు లాక్కోవొద్దని వేడుకున్న గిరిజనులపై, విచక్షణారహితంగా దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు.

ktr
ktr

దీనిపై కేటీఆర్ స్పందించారు. ఒక గూండా సీఎం ఛైర్‌లో కూర్చున్నప్పుడు.. అది అత్యాచారాలకు, అవినీతికి కేంద్రంగా మారుతుందని.. గిరిజన మహిళల మీద అధికారులు ప్రదర్శించిన పైశాచికత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యాఖ్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజన గ్రామాల్లో.. ఈరోజు జరిగిన ఘటన ముఖ్యమంత్రి విజన్‌కు ప్రతిబింబం అన్నారు. ఇదేనా మీరిచ్చిన వాగ్ధానం? మహిళలకు మీరిచ్చే గౌరవం? మీరు మాట్లాడే సమానత్వం ఇదేనా? తనని ప్రశ్నించే మహిళల్ని బట్టలిప్పి ఊరేగిస్తానని చెప్పిన సీఎం నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం? అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news