తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. ఇవాళ భక్తులకు దర్శన టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఇవాళ టీటీడీ పాలకమండలి విడుదల చేయబోతోంది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

అలాగే 11 గంటల సమయంలో శ్రీ వాణి దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను టిటిడి పాలకమండలి ఆన్లైన్ లో విడుదల చేయబోతోంది. ఇక ముఖ్యంగా మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.