నేడు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ వేడుకలు నిర్వహించనుంది. మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపునించింది.

ఇక అటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు పొంగులేటి. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించాం… గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష మని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.