President Murmu Nominated Four People For Rajya Sabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురిని రాజ్యసభ్యకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నామినేషన్లు చేశారు.

ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావు నికం, విద్యావేత్త సి. సదానందన్ మాస్తే, హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, విద్యావేత్త మీనాక్షి జైన్లను నామినేట్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.