తెలంగాణాలో ఇక నుంచి 1500కే కరోనా పరిక్ష…!

-

కరోనా నిర్ధారణ పరీక్షలను అత్యంత వేగవంతంగా చేయడానికి గాను దేశ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సరికొత్త పరికరాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కి చెందిన అంకుర సంస్థ హ్యువెల్‌ లైఫ్‌సైన్సెస్‌ అత్యంత తక్కువ ధరకు కరోనా నిర్ధారణ కిట్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ద్వారా కేవలం రెండు గంటల 30 నిమిషాల్లో పరిక్షలు చేయవచ్చు అని సంస్థ పేర్కొంది.

ఈ కిట్ కి ఐసీఎంఆర్‌ ఆమోదం తెలపడం తో దీనిని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని రావడానికి భారీగా ఉత్పత్తి చెయ్యాలని సంస్థ భావిస్తుంది. కరోనా కిట్ల కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం వీరిని సంప్రదించి ఆర్డర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి ఈ కిట్స్ తయారిని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నామని సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా పరిక్షల కోసం విదేశాల నుంచి కిట్స్ దిగుమతి చేసుకుంటున్నామని… కాని విదేశాల్లో కూడా ఈ కొరత ఉందని… అందుకే మన దేశంలో అందుబాటులోకి వస్తే ఇబ్బంది ఉండదని సంస్థ పేర్కొంది. ఒక్కో కిట్ ద్వారా వంద పరిక్షలు చేయవచ్చని… హ్యువెల్‌ లైఫ్‌సైన్సెస్‌ కిట్‌లో ఉపయోగించే రెండు రకాల ఎంజైమ్స్‌, బఫర్స్‌, ప్రైమర్స్‌ అన్ని దేశీయంగా సమకూర్చుకోవడంతో తక్కువ ధరకే అందిస్తున్నాం అని కేవలం 1500కే కరోనా పరీక్షా చేయవచ్చు అని సంస్థ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news