బ్రేకింగ్; హైదరాబాద్ ని భయపెట్టిన మూడు మృతదేహాలు…!

-

హైదరాబాద్ శివారుల్లో మూడు మృతదేహాలు ఇప్పుడు భయపెట్టాయి. హైదరాబాద్ శివారుల్లోని జవహర్ నగర్ లో పొలాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉండటం కలవరపెడుతుంది. జవహర్ నగర్ పరిధిలో రెండు మృతదేహాలు ఉరి వేసి కనిపించాయి. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.

ఆ వెంటనే మర్రి చెట్టు వద్ద మరో మృతదేహం కనపడింది. ఆ మృతదేహం చిన్నారిది కాగా, మరో రెండు మృతదేహాలు యువతులవి. అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా చంపెసారా అనేది అర్ధం కాలేదు. దీనిపై ప్రభుత్వం కూడా ఆరా తీసినట్టు సమాచారం. సంఘటనా స్థలంలో బ్యాగ్ సహా గ్లాసులు కూడా కనిపించాయి. ఆ గ్లాసుల్లో బులుగు రంగులో ఏదో పానీయం ఉన్నట్టు గుర్తించారు.

దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాలు దీనికి కారణం అయి ఉంటాయా అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఇక ఉన్నతాధికారులకు కూడా దీనిపై సమాచారం ఇచ్చారు పోలీసులు. స్థానిక సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా దొరకలేదు

Read more RELATED
Recommended to you

Latest news