వామ్మో.. పోలీసులకు చుక్కలు చూపించిన సీఎం భార్య..!

-

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ పోలీసులకు చుక్కలు చూపించింది. వాళ్లకు ముచ్చెమటలు పట్టించింది. ముంబై, గోవా మధ్య క్రూయిజ్ నౌక ఆంగ్రియా ప్రారంభమైంది తెలుసు కదా. దానికి అమృత కూడా వెళ్లింది. నౌక లోపలికి వెళ్లిన అమృత… సడెన్ గా నౌక ఎడ్జ్ కు వెళ్లి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించింది. దీంతో ఆమె సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతోందని వాళ్లు టెన్షన్ పడ్డారు. అటువైపు వెళ్లొద్దని సిబ్బంది వారిస్తున్నా వినకుండా వెళ్లి నౌక ఎడ్జ్ లో సెల్ఫీ దిగింది అమృత. అమృత సెల్ఫీ దిగుతున్నంత సేపు ఆమె సెక్యూరిటీ సిబ్బంది తెగ టెన్షన్ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి ఆమె వెనక్కి వచ్చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. అమృత సెల్ఫీ తీసుకుంటుండగా ఎవరో ఫోటో తీసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా ఆమె సెల్ఫీపై మండి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news