ఎల్వీ మీరు రిటైర్ అవ్వొచ్చు, ప్రభుత్వం కీలక నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది చివర్లో సంచలనం సృష్టించిన వ్యవహారం ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పించి నీలం సహానిని నియమించారు. ఆ తర్వాత ఆయనను మరో చోటకి ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు.

బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన పదవిలోకి వస్తారా రారా అనేది స్పష్టత రాలేదు. ఆయనను కేంద్ర సర్వీసులు ఎంపిక చేసే అవకాశం ఉందని అన్నారు. కాని అది ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు జరిగే పరిస్థితి కనపడలేదు. ఆయన మాత్రం కేంద్రానికి టచ్ లో ఉండటానికి ఢిల్లీ లోనే ఉన్నారు.

ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్వీ సుబ్రహహ్మణ్యంకు ఉద్యోగ విరమణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. బాపట్లలోని మానవ వనరుల అభివ్రుద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌గా.. ఆన్‌లైన్ ఛార్జ్ తీసుకుని పదవీ విరమణ చేసేలా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఆయన హైదరాబాద్ లో ఉండిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news