బిజినెస్ ఐడియా: ఈ పంటతో రైతులకు మంచి ఆదాయం..4 నెలల్లో లక్షలు సంపాదన..

-

ఒకప్పుడు వ్యవసాయం అంటే ఎక్కువ ఆసక్తి చూపించే కారు..కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.కొత్త కొత్త పంటలను పండిస్తూ అబ్బురపరిచే ఆదాయాన్ని అందుకుంటున్నారు..మీరు కూడా కొత్త రకం వ్యవసాయాన్ని చేయాలని భావిస్తూ ఉంటే.. తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఉత్తరప్రదేశ్లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు.

అలా కేవలం 4 నెలల్లోనే రూ.8 లక్షలు సంపాదించాడు. ఇందుకోసం నెదర్లాండ్స్‌ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో నాటాడు. ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు. అందువల్ల, రెస్టారెంట్లు మరియు హోటళ్ల నుంచి ఇటువంటి దోసకాయలకు భారీ డిమాండ్ ఉంది. ఇతర దోసకాయల కంటే వీటికి అధిక ధరలు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారం కోసం రైతు ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు గ్రాంట్ తీసుకుని పొలంలో షెడ్ నెట్ హౌస్ను ఏర్పాటు చేశారు.

దోసకాయను ఏ రకమైన నేలలోనైనా పండించవచ్చు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ దోసకాయను ఉత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. దోసకాయ పంట 60 నుండి 80 రోజులలో చేతికి వస్తుంది. ఈ సాగు కోసం భూమి యొక్క pH 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు భూమి మంచిదిగా పరిగణించబడుతుంది. దోసకాయను నదులు లేదా సరస్సుల ఒడ్డున కూడా పండించవచ్చు. వేసవిలో దోసకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దోసకాయను ప్రతీ సలాడ్ లో ఉపయోగిస్తారు. దోసకాయను పార్టీల్లోనూ వడ్డించడం ఇటీవల ఎక్కువైంది. దాంతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

దోసకాయ వ్యవసాయం నుండి మంచి లాభం పొందవచ్చు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీతో ఈ వ్యవసాయం చేసుకోవచ్చు. మార్కెట్‌లో సాధారణ దోసకాయ కిలో రూ.50 వరకు ఉంది. దోసకాయ ఉత్పత్తి రైతులకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ పొలం నుంచి దోస సాగు ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించవచ్చు. మార్కెట్ లో డిమాండ్ ఉంటే ఇంకాస్త మంచి డిమాండ్ ఉంటుంది.. మీరు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే వెంటనే పంటను వెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news