బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడి తో లక్షల ఆదాయం.. సాగులో జాగ్రత్తలు..

-

ఇప్పుడు యవత ఉద్యోగాల కన్నా కూడా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు..అంతే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వస్తున్న యువత సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొత్త కొత్త పంటలను సాగుచేస్తూ లక్షల రూపాయలను సంపాధిస్తున్నారు.తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు.

అతి తక్కువ సమయంలోనే అతడు లక్షలు గడించాడు..నెదర్లాండ్స్‌ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో నాటాడు. ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు. అందువల్ల, రెస్టారెంట్లు మరియు హోటళ్ల నుంచి ఇటువంటి దోసకాయలకు భారీ డిమాండ్ ఉంది. ఇతర దోసకాయల కంటే వీటికి అధిక ధరలు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారం కోసం రైతు ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు గ్రాంట్ తీసుకుని పొలంలో షెడ్ నెట్ హౌస్ నిర్మించుకున్నాడు ఆ రైతు..

దోసకాయ పంట 60 నుండి 80 రోజులలో చేతికి వస్తుంది. ఈ సాగు కోసం భూమి యొక్క pH 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు భూమి మంచిదిగా పరిగణించబడుతుంది. దోసకాయను నదులు లేదా సరస్సుల ఒడ్డున కూడా పండించవచ్చు. వేసవిలో దోసకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దోసకాయను ప్రతీ సలాడ్ లో ఉపయోగిస్తారు. దోసకాయను పార్టీల్లోనూ వడ్డించడం ఇటీవల ఎక్కువైంది.దానివల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అంతే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీతో ఈ వ్యవసాయం చేసుకోవచ్చు. మార్కెట్‌లో సాధారణ దోసకాయ కిలో రూ.50 వరకు ఉంది. దోసకాయ ఉత్పత్తి రైతులకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ పొలం నుంచి దోస సాగు ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించవచ్చు…మార్కెట్ బాగుంటే చాలు లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news