బిజినెస్ ఐడియా: ఇంట్లో ఉంటు నెలకు 20 వేల ఆదాయం పొందవచ్చు..

-

మీరు బిజినెస్ చేయాలనీ అనుకుంటున్నారా? అయితే మీకోసం మంచి బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది.. ఇంటి నుంచి బిజినెస్ చేయాలనీ అనుకోనేవారికి ఇది మంచి అవకాశం..అన్ని సీజన్లలో ఈ వ్యాపారానికి డిమాండ్ ఏ మాత్రం తగ్గదు. మంచి మార్కెటింగ్ చేసుకుంటే మీ బిజినెస్ కు తిరుగు ఉండదు. ఈ వ్యాపారం మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని మనందరికీ తెలిసిన విషయమే.

దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా అమ్మితే మంచి లాభాలాను పొందవచ్చు..సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000, పరికరాలు రూ.40,000. ఇది కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంలో మీ వ్యాపారం మొదలవుతుంది..

193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో క్వింటాకు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు సంపాధించవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా సంపాదన ఉంటుంది..అద్దె స్థలంలో కాకుండా సొంత స్థలంలో వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలను పొందవచ్చు.. ఇంకా వీటికి ఫ్యాకెజ్ పై కూడా శ్రద్ద పెట్టడం వల్ల ఇంకాస్త మంచి ఫలితాలను అందుకుంటారు..మీకు ఈ బిజినెస్ నచ్చతే మీరు కూడా మొదలు పెట్టండి..మంచి లాభాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news