గీతా ఆర్ట్స్.. అర్జున్ రెడ్డి డైరక్టర్.. సూపర్ స్టార్

-

అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ తన సెకండ్ మూవీగా బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా వారల్లో ఉన్న మహేష్, సందీప్ సినిమాపై అఫిషియల్ న్యూస్ బయటకు రాబోతుందని తెలుస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ తో ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందట.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారరట. మెగా హీరోలు కాకుండా గీతా ఆర్ట్స్ బయట హీరోల సినిమాలు నిర్మించింది చాలా తక్కువ. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం అంచనాలు పెంచేస్తుంది. అర్జున్ రెడ్డి తరహాలోనే మహేష్ కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ లో ఈ సినిమా ఉంటుందట.

మరి గీతా ఆర్ట్స్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ 25వ సినిమా మహర్షి చేస్తుండగా 26 సుకుమార్ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక 27వ సినిమాగా మహేష్ సందీప్ సినిమా ఉంటుందట. ఈ కలయిక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news