బ‌న్నీ కోసం అభిమాని సాహ‌సం‌!

-

సినీ స్టార్స్‌ని డెమీ గాడ్స్‌గా భావిస్తుంటారు అభిమానులు. వారి కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. త‌మిళ అభిమానులు హీరోయిన్‌ల కోసం గుడులు క‌ట్టించి ప్ర‌త్యేకంగా పూజలు చేసిన సంద‌ర్భాలు చూశాం. ప్ర‌త్య‌క్ష దైవాలుగా కొలిచిన సంద‌ర్భాల‌నీ గ‌మ‌నించాం. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ అభిమాని ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మాచ‌ర్ల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ఏకంగా 250 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశాడు. గుంటూరు జిల్లా మాచ‌ర్ల మండ‌లం కంభం పాడుకు చెందిన పి. నాగేశ్వ‌ర‌రావు అనే అభిమానికి బ‌న్నీ అంటే ప్రాణం. బ‌న్నీని క‌ల‌వాల‌ని చాలా ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. కానీ అత‌ని ప్ర‌య‌త్నం స‌ఫ‌లం కాలేదు. దీంతో బ‌న్నీ త‌న‌ని గుర్తించి త‌న‌ని క‌ల‌వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని భావించి మాచ‌ర్ల లోని త‌న స్వ‌గ్రామం నుంచి ఈ నెల 17న హైద‌రాబాద్‌కు పాద‌యాత్ర చేస్తూ కాలిన‌డ‌క‌న ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు. బుధ‌వారం హైద‌రాబాద్‌కు చేర‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌రి బ‌న్నీ అత‌ని కోరిక‌ని తీరుస్తాడా? ‌లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news