బాగానే ఉన్నా.. కంగారు పడొద్దు.. యాక్సిడెంట్ పై ఆదాశర్మ పోస్ట్

-

ఎప్పటినుంచో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ తాజాగా విడుదలైన ఇది కేరళ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆదాశర్మ. ఎన్నో వివాదాలు మధ్య విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సంపాదించడంతో పాటు ఈ సినిమాలో నటించిన ఆదాశర్మకు, ఇతర నటీనటులకు, దర్శకుడు సుదీప్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే తాజాగా ఆదాశర్మ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆందోళన పడుతున్న తన అభిమానులకు తన ఆరోగ్యం బాగానే ఉందంటూ చెప్పుకొచ్చింది.

43+ Bollywood Actress Hd Wallpapers 1080P Free Download

ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నటి ఆదాశర్మ. తాజాగా ఈమె దర్శకుడు సుదీప్ తో కలిసి వెళుతుండగా వీరిద్దరికీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు వీరి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం మొదలుపెట్టారు. వీటన్నిటిపై ఒక క్లారిటీ ఇస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని చిన్న గాయాలతో బయటపడ్డాను అంటూ తెలిపింది ఆదాశర్మ.

“యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నము.. అంటూ ట్వీట్ చేసింది.

I’m fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️

— Adah Sharma (@adah_sharma) May 14, 2023

Read more RELATED
Recommended to you

Latest news