రిపోర్టర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన నటి హేమ..!!

-

ప్రముఖ నటి హేమ ఇటీవల ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంగళవారం దర్శించుకొని అనంతరం విజయవాడలోని దుర్గమ్మను ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఇకపోతే మీడియాతో మాట్లాడినా ఆమె ఈ సందర్భంగా రిపోర్టర్ పై ఫైర్ అయ్యింది. ఇకపోతే నటి హేమ అమ్మవారి భక్తురాలు.. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆమె ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు.. ఇక ఈ క్రమంలోనే అమ్మవారిని హేమ దర్శించుకోవడం జరిగింది. ఇకపోతే ఆమె మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం.. నేను మీ హేమను.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఈ సంవత్సరం ప్రోటోకాల్ ఇబ్బంది అని చాలామంది జనాలు వస్తున్నారు.. దీంతో ఈ ఏడాది రాలేనేమో అనుకున్నాను. కానీ అమ్మవారే ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించారు.. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు.. మీ అందరికీ కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుతున్నాను” అంటూ తెలిపారు.

ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ టికెట్స్ తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన హేమ అతనిపై సీరియస్ అయింది . మేమిద్దరం వచ్చాము హుండీలో రూ.10,000 వేసాను. అమ్మవారికి రూ.20,000 పెట్టి చీర తెచ్చాను.. మీరు టికెట్ గురించి మాట్లాడుతున్నారు.. ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతున్నాం ..దీనిని కాంట్రవర్సీ చేయడం సరికాదు.. అమ్మవారిపై భక్తితో ఇక్కడికి వచ్చాను.. కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఘాటుగా స్పందించింది హేమ. ఈ విషయం తెలుసుకున్న పలువురు నెటిజన్లు రిపోర్టర్ పై మండిపడుతున్నారు.

ఇక నటి హేమ సాధ్యమైనంతవరకు కాంట్రవర్సీకి దూరంగా ఉంటుంది. కానీ ఆమెను ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కచ్చితంగా వారికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే తనను అవమానించాడని రిపోర్టర్ పై గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news