స్టేజ్‌పై వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్‌.. వీడియో వైరల్

-

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నందితా శ్వేత స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. తన లేటెస్ట్ సినిమా హిడింబ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌ లో నందిత ఎమోషనల్ అయింది.

‘‘ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సీరియస్‌ రోల్‌ నేను చేస్తానని అస్సలు అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు.  ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తర్వాత ‘హిడింబ’తో నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా నాకు సెంటిమెంట్‌గా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే, ఈ సినిమా షూట్‌లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. ఆయన ఆశీస్సుల వల్లే ఈ రోజు నాకు ఇంత మంచి పేరు వచ్చిందనుకుంటున్నా’’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news