గో కరోనా అంటూ దీపాన్ని వెలించిన ప్రముఖ హీరోయిన్ రష్మీ గౌతం..!

-

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు అందరూ కూడా తమ ఇళ్ళల్లో దీపాలను వెలిగించారు. ప్రజలతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ప్రధాని ఇచ్చిన పిలుపుతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధాని ఇచ్చిన పిలుపుతో అందరూ ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు.

 

గో కరోనా అంటూ యావత్ భారతావని దీపాల కాంతిలో వెలిగిపోయింది. ప్రజలు సినీ ప్రముఖులు అందరూ స్వచ్చందంగా ముందుకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతం తన ఇంటి బాల్కానీలో గాజు గ్లాసులో దీపాన్ని వెలిగించారు. ఈ ఫొటోని తన టిట్టర్ లో పోస్ట్ చేశారు. అందరికంటే ముందుగా దీపాన్ని వెలిగించి ఆ ఫొటోని షేర్ చేయడం తో రష్మీ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమాజం పట్ల రష్మీ చూతున్న బాధ్యతని మెచ్చుకుంటున్నారు.

ఇక నందమూరి కళ్యాణ్ రాం కూడా దీపాలని వెలిగించి ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కి నందమూరి అభిమానులు వరుసగా లైక్స్ కొడుతున్నారు. అంతేకాదు మరికొంతమంది సినీ ప్రముఖులు మోదీ సూచనని గౌరవిస్తూ దీపాలని వెలిగించి తమ బాధ్యతని చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news