ఈడీ ముందుకు రియా ఫ్యామిలీ, తండ్రి తమ్ముడు కూడా…!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు లో ఈడి ముందు హాజరైంది నటి రియా చక్రవర్తి. రెండో సారి ఈడీ ముందుకు వచ్చిన నటి రియాతో పాటుగా సోదరుడు తండ్రి కూడా హజరు అయ్యారు. ఈడి నోటీసులు రెండోసారి అందడంతో రియా హాజరు అయింది. నటి రియా అకౌంట్ నుంచి 15 కోట్ల నిధులు బదలీ పై విచారణ జరుగుతుంది. నటి రియా అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు బదలీ పై ఆధారాలు కూడా ఈడీ వద్ద ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ కేసుకి సంబంధించి ఇటీవల ఆమెను విచారించారు. దాదాపు 8 గంటల పాటు విచారణ జరిగింది. సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్… ఈ కేసుకి సంబంధించి కీలక ఆరోపణలు చేసారు. ఆమె 15 కోట్లు తన ఖాతాకు బదిలీ చేసుకుంది అని పేర్కొన్నారు. దీనితో అధికారులు ఈ కేసుకి సంబంధించి విచారణ వేగవంతం చేసారు. మరో వైపు సిబిఐ కూడా విచారణ మొదలుపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news