ఆదిపురుష్ స్ట్రీమింగ్ అయ్యేది ఆ ఓటీటీలోనే?

-

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ సినిమా గురించే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ రాముడు, సీతగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఔం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు ప్రేక్షకులకు ఈ చిత్రంపై అసలు అంచనాలు లేవు. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత.. గ్రాఫిక్స్ చూసి నెటిజన్లు చేసిన ట్రోలింగ్​కు మేకర్స్​కు దిమ్మదిరిగింది. దెబ్బకు దిగొచ్చి.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్​పై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రేక్షకులను మెప్పించేలా మళ్లీ రూపుదిద్దారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్​ కూడా చేశారు. ఈ ఈవెంట్​ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ నుంచి ఈ సినిమాకు హైప్ పెరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. కాగా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news