వామ్మో 50 కథలు వద్దన్నాడా..!

-

టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా సరే ఎవరికి వారు తమ సత్తా చాటాలి అన్న కసితో ఉంటారు. అలాంటి వారిలో అసలు ఏమాత్రం సిని పరిశ్రమకు సంబంధం లేని అడివి శేష్ ఈమధ్య సత్తా చాటుతున్నాడు. క్షణం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ రెండేళ్ల తర్వాత చేసిన సినిమా గూఢచారి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అసలు సిసలు స్పై థ్రిల్లర్ అనిపించేలా ఉంది.

శషి కిరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శోభిత దూళిపాల హీరోయిన్ గా నటించింది. సినిమాపై పూర్తి నమ్మకంగా ఉందన్న అడివి శేష్ రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేయడమే తనకు ఇష్టమని అందుకే క్షణం తర్వాత దాదాపు 50 కథలు తన దగ్గరకు వచ్చాయని అవి నచ్చక వదిలేశానని అన్నాడు అడివి శేష్. మరి అప్కమింగ్ హీరో అయిన అడివి శేష్ ఏ హోప్ తో ఇలాంటి క్రేజీ డెశిషన్ తీసుకున్నాడో అని అందరు షాక్ అవుతున్నారు.

ఇక రాబోతున్న గూఢచారి మాత్రం మరోసారి మనవాడి సత్తా చూపిస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా సుశాంత్ చిలసౌ, మారుతి కథతో బ్రాండ్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news