మహేశ్ బాబు గురించి షాకింగ్ నిజాలు చెప్పిన ‘మేజర్’ అడివి శేష్!

-

టాలీవుడ్‌లో బడా హీరోలతో సమానంగా వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సందీప్ కృష్ణ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.జీ తెలుగు‘స రి గ మ ప’ కార్యక్రమానికి హాజరై చిత్ర విశేషాలు పంచుకున్న యంగ్ హీరో..తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా ప్రోగ్రామ్’లో మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో కలిసి పాల్గొన్నారు.

ఇక ఈ షోలో ‘మేజర్ ’ఫిల్మ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. మహేశ్ బాబు తన మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పుకొచ్చాడు. విదేశాలలో పుట్టి పెరిగిన శేష్ అక్కడే మూవీస్ ఎందుకు ట్రై చేయలేదని అలి అడిగిన ప్రశ్నకు, అక్కడ హీరోగా ఎదగలేం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ‘మేజర్’ ఫిల్మ్ కు సంబంధించిన విషయాలు తెలిపాడు. మేజర్ ఫిల్మ్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా చిత్ర విశేషాలు పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version