లాక్ డౌన్ తర్వాత వెబ్ సిరీస్ లే సంచలనం సృష్ఠించబోతున్నాయా …?

-

గత నాలుగేళ్ళగా సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లకే ప్రజలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారన్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్, అమోజాన్ లాంటి ఓటిటి ప్లాట్ ఫాంస్ వచ్చి ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది స్టార్స్ ఈ తరహా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగా సంపాదిస్తున్నారు కూడా. అడల్ట్ కంటెంట్, రొమాంటిక్ సిరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్, గ్యాంస్టర్ బ్యాగ్డ్రాప్ ..ఇలా రక రకాల జోనర్స్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లు నిర్మించి డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి ముందు గా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాయి. అందులో బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది లస్ట్ స్టోరీస్.

అప్పటి నుంచి ఈ ఒక్క జోనర్ లోనే కాకుండా అన్ని రకాల జోనర్స్ లోను నిర్మాతలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కి భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. భారీ కాస్టింగ్ ని నటింపజేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటీ నటులు నటించిన సంగతి తెలిసిందే. రాధిక ఆప్టే, మనీషా కోయిరాల, సంజయ్ కపూర్, నేహ ధూపియా, భూమి పడ్నేకర్ ముందు ఈ వెబ్ సిరీస్ లో నటించి చాలామందికి దారి చూపించారు. ఇక టాలీవుడ్ రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తే రాని క్రేజ్, పాపులారిటి లస్ట్ స్టోరీస్ తో సాధించింది బ్యూటి ఫుల్ హీరోయిన్ కియారా అద్వాని.

ఇప్పుడు తనని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్నారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాధవన్, తమన్నా, సమంత, ప్రియమణి, జగపతి బాబు ఇలా చాలామంది సౌత్ యాక్టర్లు ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఫ్యామిలీ మాన్ సీజన్ 1 లో ప్రియమణి నటించగా ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్స్ సీజన్ 2 లో అక్కినేని సమంత నటిస్తుంది. ఇప్పటికే తనకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీటయింది.

ఇక జగపతి బాబు కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో కండోం ఫ్యాక్టరీ ఓనర్ పాత్రలో జగపతి బాబు నటించడం ఆసక్తి కరమైన విషయం. ఐతే ప్రస్తుతం నెలకొన్న కరోనా కారణంగా సినిమాల కంటే వెబ్ సిరీస్ బెటర్ అని అందరూ ఆలోచిస్తున్నారట. సంపాదన పరంగా కూడా సినిమా కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా సంపాదించవచ్చని ఆలోచిస్తున్నారట. ఇక తెలుగులో కూడా ఆహా అన్న పేరుతో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news