‘మిస్టర్ మజ్ను’ ఆరోజు ఫిక్స్

-

అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను అనే టైటిల్ ప్రచారం లో ఉంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ సర్ ప్రైజ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏయన్నార్ జయంతి సందర్భంగా బుధవారం రిలీజ్ చేస్తున్నారు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ ముందు డిసెంబర్ 21న అనుకోగా.. ఆ టైంలో వేరే సినిమాలు వరుస కట్టడంతో ఫైనల్ గా 2019 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మిస్టర్ మజ్ ను సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అఖిల్, హలో సినిమాల తర్వాత అఖిల్ చేస్తున్న 3వ సినిమాగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాతో అయినా అఖిల్ కమర్షియల్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మిస్టర్ మజ్ను టైటిల్ కన్ఫాం అయితే ఇది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో వస్తుందని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version