అఖిల్ మిస్టర్ మజ్ను ఫిక్స్ అవ్వొచ్చా..!

-

అక్కినేని అఖిల్ 3వ సినిమాగా రాబోతున్న మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే రిలీజైన మిస్టర్ మజ్ను టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాపై ఆసక్తి పెంచింది. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది.

ముందు డిసెంబర్ ఎండింగ్ లో క్రిస్ మస్ కానుకగా వస్తుందని అనుకున్న మిస్టర్ మజ్ను సినిమా సంక్రాంతి బరిలో దించాలని చూశారు. సంక్రాంతికే కాదు రిపబ్లిక్ డేకు భారీ సినిమాలు ఉండటంతో అఖిల్ సినిమా జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సంక్రాంతికి ఓ వారం ముందు అంటే 5 నుండి 8 వ తారీఖుల్లో మిస్టర్ మజ్ను సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది. తొలిప్రేమ సూపర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news