మిస్టర్ మజ్ను ఎంత పలికాడు..!

-

అక్కినేని అఖిల్ మూడవ సినిమాగా వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మించారు. అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ హంగామా బాగుంది. అఖిల్ ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనే చెబుతున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టింది.

అఖిల్ మొదటి సినిమా అఖిల్ 40 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన హలో కూడా పెద్దగా మెప్పించలేదు. ఫైనల్ గా మిస్టర్ మజ్ను 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతుంది. అఖిల్ కెరియర్ లో ఇది తక్కువ బిజినెస్ చేసిన సినిమా కాని సినిమా మాత్రం అఖిల్ కు హిట్టు ఖాతా తెరిచేలా కనిపిస్తుంది. ఏపి తెలంగాణా కలిపి 17.35 కోట్లు బిజినెస్ చేసిన మిస్టర్ మజ్ ను. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.50 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ 3.70 కోట్ల వరకు ఈ సినిమా పలికింది.

మొత్తానికి అఖిల్ సినిమా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండగా ఈ సినిమా అయినా అఖిల్ కు మంచి ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news