మరొక రెండు రోజుల్లో ‘అల వైకుంఠపురములో మరొక సర్ప్రైజ్’….!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మరియు ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన రెండు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గతంలో డీజేలో బన్నీ సరసన నటించిన పూజా హెగ్డే, ఈ సినిమా ద్వారా మరొక్కసారి ఆయనతో జోడి కడుతోంది.

పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై అల్లు  అరవింద్, ఎస్ రాధాకృష్ణ  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా నుండి ఈనెల 14వ తేదీన ఫ్యాన్స్ కోసం మరొక స్పెషల్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిందట సినిమా యూనిట్. అయితే అది సినిమాలో వచ్చే మూడవ సాంగా లేక మరొక టీజరా అనేది మాత్రం తెలియరాలేదు.

ala vaikunta puram lo drops on release date

ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఎక్కువగా యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోగా, ఈసారి రిలీజ్ చేయబోయే ‘డాడీ డాడీ’ అనే సాంగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో కనెక్ట్ అవుతుందని సినిమా యూనిట్ భావిస్తోందట. అయితే ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది. ఇదివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టి, వారిద్దరికీ హ్యాట్రిక్ ఇవ్వడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ బాగా నమ్మకంగా ఉన్నారు. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సినిమా వారి ఆశలు ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి……!!

Read more RELATED
Recommended to you

Latest news