హీరోయిన్స్ అందరిని అలాగే అడుగుతున్నారా …?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు రష్మిక మందన్న, పూజా హెగ్డే. ఇప్పుడు ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా వచ్చి చేరింది. పూజా హెగ్డే ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని అందుకుంటుండంతో టాలీవుడ్ లో ఈ బ్యూటి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఫాం లో ఉంది.

 

ఇక ప్రస్తుతం రష్మిక మందన్న సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా అందులోను 5 భాషల్లో రిలీజ్ కాబోయో పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. పూజా హెగ్డే నాలుగు సినిమాలు చేసినా రష్మిక మందన్న ఈ ఒక్క సినిమా చేసినా ఒకటే అవుతోంది. మొత్తానికి పూజా రష్మిక ల మద్య అలా బ్యాలెన్స్ అవుతోంది. ఇక రష్మిక ఒక తమిళ, ఒక కన్నడ సినిమాలు అంగీకరించింది.

 

వీరితో పాటు రేస్ లోకి దూసుకొచ్చింది కీర్తి సురేష్. 6-7 సినిమాలు చేతిలో ఉన్న ఈ మహానటి తెలుగులో ప్రస్తుతం నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తోంది. మరో సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే అమెజాన్ ప్రైం లో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా జూన్ 19 న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ టాప్ రేస్ లో ఉన్న హీరోయిన్స్ అందరి రెమ్యూనరేషన్స్ బాగా తగ్గనున్నాయట. తెలుగులోనే కాకుండా వీరు నటించే ఇతర భాషల్లోను ఇదే పరిస్థితి అని తెలుస్తుంది. ఒకవేళ కాదు.. కూడదు అంటే నిర్మాతలు కొత్త వాళ్ళ వైపు చూస్తున్నట్టు తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news