మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా..!

-

తెలంగాణలో నిన్న, మొన్నటి దాక అదుపులో ఉన్న కరోనా వైరస్, ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనల సదలింపుతో ఒక్కసారిగా తీవ్రంగా మారింది. దీంతో రోజుకి అధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజాప్రతినిదులకు సైతం కరోనా టెన్షన్ పట్టుకుంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త తెలంగాణలో కలకలం రేపుతుంది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news