అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆహా నుండి వచ్చే చిత్రాలు..

-

ప్రస్తుతం ఓటీటీలదే రాజ్యం. కరోనా కారణంగా మూసుకున్న థియేటర్ల స్థానంలో ఓటీటీలు వచ్చేసాయి. దీనివల్ల ఓటీటీలకి డిమాండ్ బాగా పెరిగింది. సబ్ స్క్రయిబర్స్ రోజు రోజుకీ పెరుగుతున్నారు. అందువల్ల ఓటీటీ సంస్థలు ప్రేక్షకులని తమ వైపు తిప్పుకోవడానికి కొత్త కంటెంట్ ని తీసుకువస్తున్నారు. వంద శాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన ఆహాకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కొత్త కంటెంట్ ని తీసుకువచ్చే పనిలో పడింది.

ఇప్పటికే కొత్త కొత్త సినిమాలు ఆహాకి మరింత మంది సబ్ స్క్రయిబర్లని తెచ్చిపెడుతున్నాయి. ఐతే ప్రేక్షకులని మరింత ఎంగేజ్ చేయడానికి ఆహా నుండి సరికొత్త ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. సమంత, పాయల్ రాజ్ పుత్ మొదలగు వారు ఈ ప్రోగ్రామ్స్ లో భాగం కాబోతున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి గురించి బయటకి వెల్లడి చేసేందుకు ఒక ప్రత్యేక వేడుక జరగనుందట. ఆ ప్రత్యేక వేడుకలో అల్లు అర్జున్ అతిధిగా రానున్నాడట. అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news