రామ్‌చరణ్ అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!

-

ఉపాసన ,రాంచరణ్ జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరికి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత తాజాగా పండంటి బిడ్డకు ఉపాసన జన్మంచిన సంగతి తెలిసిందే. అయితే.. రామ్ చరణ్-ఉపాసనల కూతురు బారసాల ఇవాళ జరగనుంది.

ఈ సందర్భంగా చెర్రీ కూతురు కోసం బిలియనీర్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత ఖరీదైన బహుమతి పంపినట్లు తెలుస్తోంది. రూ. 1.20 కోట్లతో సుమారు రెండు కేజీల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఊయలను ఆయన గిఫ్ట్ గా పంపారని వార్తలు వస్తున్నాయి. మెగా ప్రిన్సెస్ కు ఆ ఊయలలోనే బారసాల చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news