తగ్గేదేలే అంటున్న దేవరకొండ బ్రదర్‌..మరో కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్‌

-

టాలీవుడ్‌ యంగ్ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో ఆనంద్‌ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్‌ దేవరకొండ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో శివాత్మిక రాజశేఖర్ వెండితెరకి పరిచయం అయింది.

తర్వాత వచ్చిన సినిమాలు బాగా ఆడటంతో.. వరుసగా సినిమాలను చేస్తున్నాడు ఆనంద్‌ దేవర కొండ. అయితే.. తాజాగా మరో సినిమాను అనౌన్స్‌ చేశారు ఆనంద్‌ దేవరకొండ. అంతేకాదు..ఈ సినిమా పోస్టర్‌ కూడా విడుదల చేశారు. “గంగం గణేశా”… అనే సినిమాను ఆనంద్ దేవరకొండ ప్రకటించాడు.

ఈ సినిమాను ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీత స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news