రష్మి దేశభక్తికి హ్యాట్సాఫ్ ..!

-

జబర్దస్త్ రష్మిలో కొత్త యాంగిల్ గురించి ఇప్పుడు అంతటా చర్చ కొనసాగుతుంది. హీరోయిన్ కావాలని వచ్చి సినిమాల్లో ట్రై చేసి యాంకర్ గా సెటిల్ అయ్యిన రష్మి ఈమధ్య సినిమల్లో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. మరి అమ్మడిలో యాంకర్ కమ్ హీరోయిన్ అన్ని చూశాం ఇక తనలో కొత్త యాంగిల్ ఏంటి అంటే దేశ భక్తి. రీసెంట్ గా జరిగిన పుల్వామా దాడిలో జరిగిన సైనిక మారణ హోమంలో 42 మంది సనికులు వీర మరణం పొందారు.

అయితే ఈ సంఘటన పట్ల అందరితో పాటుగా ట్వీట్స్ చేస్తూ వచ్చింది రష్మి. అంతేకాదు ఆ దాడి విషయంలో క్రికెటర్ కం పొలిటిషియల్ సిద్ధు పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడగా అతన్ని వాయించింది రష్మి. ఇదిలాఉంటే పుల్వామా దాడి తర్వాత సైనిక వీరుల కోసం విరాళాలు సేకరిస్తున్న అందరికి ట్వీట్స్ చేస్తూ రిప్లైస్ ఇస్తుంది రష్మి. తనకు తెలిసిన వారిని.. ఫాలోవర్స్ ను సైనిక వీరుల కోసం తమ వంతు సహకారాన్ని అందజేయాలని పిలుపునిచ్చింది. రష్మి చేస్తున్న మంచి పనికి ప్రేక్షకుల నుండి మంచి సపోర్ట్ దొరుకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news