సరిలేరు నాకెవ్వరు అంటున్న మహేష్ బాబు.. ఎఫ్-2 డైరక్టర్ అదే సెంటిమెంట్…!

-

పటాస్ నుండి ఎఫ్-2 వరకు సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేసిన అనీల్ రావిపుడి తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ సరిలేరు నాకెవ్వరు అని పెట్టబోతున్నారట. నీ దూకుడు సాటెవ్వరు అని మహేష్ దూకుడు పాటనుండి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తన ప్రతి సినిమాకు ఫాలో అయ్యే సెంటిమెంట్ నే ఈ సినిమాకు ఫాలో అవుతున్నాడు అనీల్ రావిపుడి.

సినిమా మొదలు పెట్టడానికి ముందే సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయడం అనీల్ రావిపుడికి అలవాటు. అలానే మహేష్ సినిమాకు ముందుగానే టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత జూన్ నుండే అనీల్ రావిపుడి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి అనీల్ తో మహేష్ సినిమా ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news