టాలీవుడ్ కు జగన్ శుభవార్త.. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో జారీ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. సినిమా టిక్కెట్ల ధరల పెంచుతూ త్వరలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ జీవో జారీ ప్రక్రియ పై తుది కసరత్తు చేస్తున్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ రాత్రి లేదా రేపటి లోగా జీవో జారీ చేయనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్.

CM JAGAN
CM JAGAN

వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలని సినీ పెద్దల నుంచి ప్రభుత్వానికి రిక్వెస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టిక్కెట్ ధరల పెంపు పై వివిధ స్థాయిల్లో చర్చించింది టిక్కెట్ ధరల నిర్ధారణ కమిటీ. జీవో 35 ధరలతో పోల్చుకుంటే కొత్త జీవోలో చెప్పు కోదగ్గ స్థాయిలోనే కొత్త ధరల నిర్ధారణ చేయనుంది AP సర్కార్. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఊరట నిచ్చేలా కొత్త ధరలు ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news