కోలీవుడ్ ప్రేమజంట ఒక్కటవుతుందా..!

-

ఈమధ్య బాలీవుడ్ ప్రేమ జంటల పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. దీపికా, రణ్ వీర్ తో పాటుగా.. నిక్ జోనాస్, ప్రియాంకాల వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇక టాలీవుడ్ లో రెండేళ్ల క్రిందటే నాగ చైతన్య, సమంతలు ఒక్కటయ్యారు. ఇదిలాఉంటే మరో క్రేజీ ప్రేమ జంట ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్నారట. కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆర్య, హీరోయిన్ సహేషా సైగల్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు.

కొన్నాళ్లుగా మీడియాలో నలుగుతున్న వీరి ప్రేమ వ్యవహారం ముదిరి పాకానికి వచ్చింది. సైలెంట్ గా వీరి ప్రేమని పెద్దల దగ్గర చెప్పడం వారి ఆమోదాన్ని పొందడం జరిగిదట. మార్చి 9, 10 తారీఖులలో ఆర్య, సయేషా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారట. హైదరాబాద్ లోనే వీరి పెళ్లి జరుగనుందట. కొన్నాళ్లుగా అనుష్క, నయనతారలతో ఎఫైర్ నడిపించాడన్న వార్తలు వచ్చిన ఆర్య ఫైనల్ గా సయేషా సైగల్ కు ఫిక్స్ అయ్యాడు.

సయేషా సైగల్ కూడా అఖిల్ మొదటి సినిమా అఖిల్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా తర్వాత తమిళంలో సినిమాలు చేస్తూ వస్తుంది. మరి ఆర్య, సయేషా పెళ్లిపై అఫిషియల్ న్యూస్ ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news