#మీటూ.. ఆశా షైనీ కూడా..!

-

హాలీవుడ్ లో మొదలైన హీరోయిన్స్ వేధింపుల మీటూ కాంపెయిన్ ఇప్పుడు బాలీవుడ్ కు తాకింది. రీసెంట్ గా తనుశ్రీ దత్తా నానా పటేకర్ తనపై చేసిన లైంగిక దాడి గురించి బయట పెట్టింది. అప్పటి నుండి ఆమెకు సపోర్ట్ గా కొందరు నిలుస్తుంటే.. మరికొందరేమో ఆమె కామెంట్స్ ను వ్యతిరేకించారు. ఇదిలాఉంటే మీటూ కాంపెయిన్ ఇప్పుడు సౌత్ పరిశ్రమకు చేరింది.

ఇందులో భాగంగా తనపై 2007లో జరిగిన ఓ సంఘటనని చెప్పుకుంది ఆషా షైనీ. నరసింహనాయుడు సినిమాలో లక్స్ పాపగా ఆంధ్రా ప్రేక్షకుల మనసు దోచిన ఆషా షైనీ నిర్మాత గౌరంగ్ దోషి తనని లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా తనని చావబాధాడని చెప్పుకొచ్చింది. గౌరంగ్ చేసిన ఆ పనిని అప్పుడు తాను వెళ్లడించినా సరే అప్పుడు తనకు సరైన రెస్పాన్స్ రాలేదని చెప్పింది.

అంతేకాదు తన గురించి చెప్పానని తనకు అవకాశాలు రాకుండా చేశాడని చెప్పింది. #మీటూకు తన మద్ధతు ఉంటుందని.. లైంగిక వేధింపులపై నోరు విప్పుతున్న ప్రతి ఒక్కరు హీరోలుగా ఆశా అభివర్ణించింది.

Read more RELATED
Recommended to you

Latest news