పరువు హత్యలపై నాగార్జున కామెంట్

-

మిర్యాలగూడ పరువు హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృతని పెళ్లాడాడని ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు అమృత తండ్రి మారుతి రావు. ఈ పరువు హత్యపై సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. మంచు మనోజ్, రాం చరణ్ లు దుర్ధటన జరిగినప్పుడే తమ స్పందన తెలియచేశారు. ఇక లేటెస్ట్ గా పరువు హత్యల మీద తన రియాక్షన్ చూపించారు నాగార్జున.

పిల్లలకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో వారికి తెలుసని.. లైఫ్ పార్ట్ నర్ విషయంలో వారి నిర్ణయానికి స్వేచ్చ ఇవ్వాలని. తమ జీవితం భాగస్వామిగా ఒక వ్యక్తి కావాలని పిల్లలు బలంగా ఎంచుకున్నప్పుడు వాటి నిర్ణయాన్ని గౌరవించాలని పరువు హత్యలు చేయడం ఏమాత్రం సరైనది కాదని అన్నారు నాగార్జున.

చిన్నప్పుడు వారు అడిగిన బొమ్మలను కొనిస్తాం.. ఊహ తెలిశాక నచ్చిన డ్రెస్సులను వారే సెలెక్ట్ చేసుకుంటారు.. కెరియర్ పై కూడా వారే నిర్ణయం తీసుకుంటారని.. పెళ్లి విషయంలో కూడా వారి నిర్ణయం గౌరవించాలని అన్నారు. తన వరకు తన పిల్లకు పూర్తి స్వేచ్చనిచ్చానని. వారి లైఫ్ వారిష్టం అని అంటున్నాడు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news