నాగ‌శౌర్య‌‌కు బాల‌య్య షాకిచ్చారా?

-

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు భారీగా క్రేజ్ ఏర్ప‌డుతోంది. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు సై అంటుండ‌టంతో ఈ త‌ర‌హా చిత్రాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో భారీ డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో మేక‌ర్స్ కూడా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఈ కోవ‌లో హీరో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా యంగ్ హీరో నాగ‌శౌర్య‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

యంగ్ హీరో నాగ‌శౌర్య స్పీడు పెంచారు. వ‌రుస‌గా సినిమాల్ని అంగీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు చిత్రాలు సెట్స్‌పై వున్నాయి. మ‌రో రెండు చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్నాయి. ఇందులో శ్రీ‌దేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించ‌నున్న మూవీ ఒక‌టి. ఈ చిత్రాన్ని మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కించ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో బాల‌కృష్ణ చేత కీల‌క పాత్ర చేయించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే బాల‌కృష్ణ మాత్రం ఈ టీమ్‌కు షాకిచ్చార‌ని తెలిసింది. బాల‌య్య‌తో శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఆదిత్య 369, వంశానికొక్క‌డు, భ‌లేవాడివి బాసు వంటి చిత్రాల్ని అందించారు. ఆ చొర‌వ‌తో బాల‌కృష్ణ‌ని తమ చిత్రంలో కీల‌క అతిథి పాత్ర కోసం సంప్ర‌దించార‌ట‌. అయితే బాల‌య్య మాత్రం అవ‌న్నీ కుద‌ర‌వు అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇస్తేనే అని క‌రాకండీగా చెప్పి షాకిచ్చార‌ట‌. దీంతో బాల‌య్య , నాగ‌శౌర్య‌ల మల్టీస్టారర్ క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ‌

Read more RELATED
Recommended to you

Latest news