రైలు దోపిడీ చేస్తూ దొరికిన బండ్ల గణేశ్ .. అడ్డంగా బుక్ అయ్యాడు !!

-

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో అడుగు పెట్టి…అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో మీడియా ముందు పీక కోసుకుంటా అని చాలెంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక నవ్వుల పాలయ్యాడు బండ్ల గణేష్. అయితే కామెడీ పాత్రలు చేసి చాలా కాలం అయిన తర్వాత మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇటువంటి నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టే స్పీచ్ ఇచ్చాడు బండ్ల గణేష్.

అయితే సినిమాలో బండ్ల గణేష్ రైలులో దొంగ క్యారెక్టర్ చేసినట్లు అనిల్ రావిపూడి తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే తరుణంలో విడుదలయిన థియేట్రికల్ ట్రైలర్ లో కూడా బండ్ల గణేష్ అదే తరహాలో వేషం వేసుకుని నోట్లో బ్లేడ్ పెట్టుకుని రైలులో దొంగగా నటించినట్లు టైలర్ లో తేలిపోయింది. మొత్తంమీద చూసుకుంటే ట్రైలర్ లో  బండ్ల గణేష్ ట్రైన్ లో అదరగొట్టే కామెడీ చేసినట్లు చూస్తున్న విజువల్స్ బట్టి తెలుస్తోంది.

 

అదే తరుణంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..నా క్యారెక్టర్ సినిమాలోని హైలెట్ అని ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉండిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంమీద చూసుకుంటే బండ్ల గణేష్ కమెడియన్ గా ట్రైన్ దొంగ క్యారెక్టర్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news